ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణికం ఠాగూర్ లీగల్ నోటిసులు పంపారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అద్యక్షుడిగా రేవంత్ ను నియమించేందుకు 25 కోట్లు మాణికం ఠాగూర్ వసూళ్లు చేశాడంటూ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ పై క్షమాపణలు చెప్పాలని నోటిసులో పేర్కొనారు.
తెలంగాణ పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డిని నియమించేందుకు రూ. 25 కోట్లు తీసుకున్నారంటూ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి…కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణికం ఠాగూర్ పై చేసిన ఆరోపణ. దీనిపై స్పందించిన మాణికం సుధీర్ రెడ్డికి లీగల్ నోటిసులు పంపారు. తనపై చేసిన అసత్య ఆరోపణలపై లిఖతపూర్వకంగా, భేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ …సుధీర్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలు తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని అందులో పేర్కొన్నారు. సుధీర్ రెడ్డి ఆరోపణలతో మాణికం ఠాగూర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, వారం రోజుల్లోగా ఆయన లిఖిత పూర్వక సమాధానం చెప్పాలంటూ ఠాగూర్ తరపు న్యాయవాది ఆర్.రవీంద్రన్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. క్షమాపణలు చెప్పకుంటే కోటి రూపాయల పరువునష్టం దావాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.