సెకండ్ వేవ్ నేపథ్యంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఫస్ట్ వేవ్ సమయంలో 20 శాతం మంది పేషెంట్లు అస్పత్రిల్లో చేరారని, సెకండ్ వేవ్ లో 95 శాతం మంది ఇంటి వద్దే ఉంటూ చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 47 వేల పడకల్లో సగానికి పైగా కోవిడ్ పేషెంట్లకే వాడుతున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ ధర్నాలు చేయవద్దని కోరారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గాంధీ, టిమ్స్, కింగ్ కోఠి ఆస్పత్రులను మంత్రి ఈటల సందర్శించారు. ఆస్పత్రుల్లో ఉన్న ఏర్పాట్లు, ఔషదాల లభ్యతలను పరిశీలించారు. అనంతరం జిల్లాల వైద్యాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించడం, వారికి వెంటనే టెస్టులు చేయడం చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఔషదాలు,ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.