July 03, 2022

Tv6 Telugu Live

  • Home
  • ఆంధ్రప్రదేశ్
  • ఇంటర్నేషనల్
  • క్రైమ్
  • తెలంగాణ
  • నేషనల్
  • మూవీస్
  • వీడియోస్
  • స్పెషల్ స్టోరీస్
  • LIVE
Home ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

భవన నిర్మాణ కార్మికుల కష్టాలు తీర్చండి.

By admin
2 days ago
in :  ఆంధ్రప్రదేశ్

కడప జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అలోచించి నిర్ణయాలు తీసుకోవాలని భవన నిర్మాణ కార్మికుల ఫెడరేషన్ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి రామమోహన్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాలువ నాగేంద్ర బాబులు డిమాండ్ చేశారు. బద్వేలు పట్టణంలోని సుందరయ్య భవన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల మావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం మీద శ్రద్ద పెట్టకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఇసుక ధరలు పెరగడం కారణంగా …

Read More

మైనార్టీలను జగన్ మోసగించారు

By admin
2 days ago
in :  ఆంధ్రప్రదేశ్

మైనార్టీలను జగన్ దారుణంగా మోసగించారని టీడీపీ మైనార్టీ విభాగం కార్యదర్శి మహబూబ్ భాషా విమర్శించారు. టీడీపీ హయంలో మైనార్టీలకు దుల్హన్ పథకం, విదేశీ విద్య కానుకగా ఇచ్చేవారని గుర్తు చేసిన ఆయన…వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పథకాలను రద్దు చేసి మైనార్టీల నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు. వెంటనే దుల్హన్ పథకం పునరుద్దించాలని డిమాండ్ చేశారు. వైసీపీలోని మైనార్టీ నేతలంతా కలిసి జగన్ పై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు.

Read More

జగన్ ఈసారి గెలవడం కష్టమే

By admin
2 days ago
in :  ఆంధ్రప్రదేశ్

రానున్న ఎన్నికల్లో పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో జ‌గ‌న్ గెలుపు అంత సులువు కాద‌న్నారు ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి. 175 నియోజ‌క‌వ‌ర్గాల‌ సంగ‌తి దేవుడెరుగు.. జగన్ పులివెందులలో గెలిస్తే గొప్పేన‌ని అన్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోని మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల‌ను గెలుచుకోవ‌డ‌మే త‌మ లక్ష్యంగా ప్లీన‌రి సాగ‌బోతోంద‌ని స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి ప్రక‌టించ‌డం హాస్యాస్పదంగా ఉంద‌ని తుల‌సిరెడ్డి ఎద్దేవా చేశారు. పులివెందుల నియోజకవర్గంలో వైఎస్సార్ ఘాట్ ఉన్న ఇడుపులపాయ గ్రామంలో వైసీపీ కార్యకర్తలు గ్రామ సచివాలయానికి తాళాలు వేశారని తుల‌సిరెడ్డి తెలిపారు.

Read More

పార్టీ పటిష్టతకు అందరూ కృషిచేయాలి

By admin
2 days ago
in :  ఆంధ్రప్రదేశ్

టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు నేతలు, కార్యకర్తలు కృషిచేయాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో పార్టీ ఎవరికి టిక్కెట్‌ ఇచ్చినా, అంతా కలిసికట్టుగా అభ్యర్థి విజయానికి కృషిచేయాలన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం టీడీపీ శ్రేణుల ఆత్మీయ సమావేశం మండలంలోని కొండకర్ల ఆవ వద్ద జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గంటా మాట్లాడుతూ ఉత్తర నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం మూడేళ్లలో ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ, ఆత్మస్థైర్యం కోల్పోకుండా నాయకులు, టీడీపీ శ్రేణులు కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయడం సంతోషాన్నిచ్చిందన్నారు. వచ్చే …

Read More

పట్టభద్రుల రాయలసీమ టిడిపి అభ్యర్థిగా భూమిరెడ్డి రామ్ గోపాల్

By admin
2 days ago
in :  ఆంధ్రప్రదేశ్

పట్టభద్రుల రాయలసీమ టిడిపి అభ్యర్థిగా భూమి రెడ్డి రామ్ గోపాల్ రెడ్డి బరిలోకి నిలిపినట్లు అనంతపురం టిడిపి పార్లమెంట్ అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసులు తెలిపారు. జగన్ మూడేళ్ల కాలంలో రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. చట్టసభల్లో ప్రభుత్వ వ్యతిరేక తీరును ఎండగట్టగలిగే టిడిపి అభ్యర్ధులను రాయలసీమకు చెందిన విద్యావంతులు మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని, రాయలసీమ సమస్యల పట్ల ‎శాసనమండలిలో గళమెత్తేందుకు టిడిపి అభ్యర్దికి అవకాశం ఇవ్వాలని కోరారు.

Read More

మోడీ ఆలోచన విధానమే ఏపీని రక్షిస్తోంది

By admin
3 days ago
in :  ఆంధ్రప్రదేశ్

ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచన విధానమే ఏపీని రక్షిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లి గ్రామంలో నరేంద్ర మోడీ 8 సంవత్సరాల పాలనపై బిజెపి జిల్లా అధ్యక్షులు కర్రి చిట్టిబాబు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. టిడిపి, వైసిపి ప్రభుత్వాలు ప్రజలకు చేసింది ఏమీ లేదని ప్రజలకు ఏం చేశారో దమ్ముంటే చెప్పాలని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.

Read More

వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడుతుందంటే కార్యకర్తల కష్టముంది

By admin
3 days ago
in :  ఆంధ్రప్రదేశ్

ఏపీలో వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడుతుందంటే అందులో కార్యకర్తల కష్టం ఎంతో ఉందన్నారు హోంమంత్రి తానేటి వనిత. రాజమండ్రి సిటీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. దేశం కోసం అహర్నిశలు పాటుపడుతున్నది ఆర్మీ అయితే వైఎస్సార్‌సీపీ కోసం అహర్నిశలు పాటుపడుతుంది కార్యకర్తలేనని చెప్పారు. కార్యకర్తలు ఉన్నారనే మనోధైర్యంతోనే సీఎం వైఎస్ జగన్ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దిగ్విజయంగా పాలన సాగిస్తున్నారన్నారు. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్లే గడపగడపకు మన ప్రభుత్వం పేరిట ప్రజల ముందుకు వెళ్లగలుగుతున్నామన్నారు.

Read More

మోదీ ప్రభుత్వం వచ్చాకే విడిగా ఫిషరీస్ మినిస్ట్రీ ఏర్పాటు

By admin
3 days ago
in :  ఆంధ్రప్రదేశ్

దేశంలో మోదీ ప్రభుత్వం వచ్చాకే విడిగా ఫిషరీస్ మినిస్ట్రీని ఏర్పాటు చేసిందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. మత్స్యసంపద యోజన కింద కోల్ట్ స్టోరేజి, మార్కెటింగ్ చేయాల్సి ఉందని తెలిపారు. ప్రతిజిల్లాలో మత్స్యమార్కెట్ కమిటీలు ఏర్పాటు అవసరం ఉందన్నారు. ఫిషింగ్ హార్బర్‌లో సర్వైలెన్స్ కెమెరాలు, పోలీస్ సబ్ పోస్ట్ ఏర్పాటు చేయాలని అన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డులు తీసుకున్నవారు చాలా తక్కువగా ఉన్నారని, ప్రతిఒక్కరికీ రుణసదుపాయం అందేలా బ్యాంకులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. మత్స్యకారులకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తామన్నారు. మత్స్యకారులు వెనుక బడినవర్గంలో …

Read More

ద్విచక్ర వాహనాల దొంగను గుర్తించిన పోలీసులు

By admin
3 days ago
in :  ఆంధ్రప్రదేశ్, క్రైమ్

విశాఖ నగరంలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో 25 ద్విచక్ర వాహనాలను దొంగలించిన నిందితుడిని అరెస్టు చేసినట్టు ఏడీసీపీ క్రైమ్‌ గంగాధరమ్‌ తెలిపారు. మహారాణిపేట మంతావారి వీధికి చెందిన సత్య తరుణ్‌కుమా ర్‌  జనవరి 28న బీవీకే కాలేజీలో పరీక్ష రాయటానికి వెళ్లారు. అక్కడ తన ద్విచక్రవాహనం పార్కింగ్‌ చేసి తాళం వేయడం మరిచారు. తిరిగి వచ్చేసరికి తన వాహనం కనిపించకపోవడంతో ద్వారకా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా  ఆర్‌టీసీ కాంప్లెక్స్‌ వద్ద  చేపల ఉప్పాడ ప్రాంతానికి …

Read More

అంగన్ వాడీల ఆందోళన

By admin
3 days ago
in :  ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్ వాడీలు విశాఖ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. గర్భిణీ, బాలింతల భోజనం మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తు నినాదాలు చేశారు. అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జూలై ఒకటో తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు వైయస్ఆర్ సంపూర్ణ పోషన, సంపూర్ణ పోషణ ప్లస్ క్రింద మధ్యాహ్న …

Read More
123...30Page 1 of 30

Recent Posts

  • భవన నిర్మాణ కార్మికుల కష్టాలు తీర్చండి.
  • మైనార్టీలను జగన్ మోసగించారు
  • జగన్ ఈసారి గెలవడం కష్టమే
  • పార్టీ పటిష్టతకు అందరూ కృషిచేయాలి
  • కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం

Stay Connected

  • 1365Posts

Film Gallery

Narappa Exclusive on Amazon Prime Video on 22nd July
Adivi Sesh Major movie expected to release on August 2nd.
Keerthy Suresh and Aadhi “Good Luck Sakhi Movie” Teaser will be out on August 15th
Suspense Crime Thiller ParigettuParigettu Grand Releasing On July 30th

Recent Lives

https://www.youtube.com/watch?v=cLJBbVjkSvg&ab_channel=TV6TeluguLive
Copyright © and Trade Mark Notice owned by or licensed to Sree Adhishankara Broadcasting PVT Ltd. Designed & Developed by Tv6 Telugu.